క్రీడాలోకానికి క‌రోనా కాటు..

March 17, 2020

క్రీడాలోకానికి క‌రోనా కాటు..
క‌రోనా దెబ్బ‌తో క్రీడాలోకం మూగ‌బోవ‌డం విచార‌క‌ర‌మ‌ని టీమ్ఇండియా ఓపెన‌ర్ రోహిత్‌శ‌ర్మ అన్నారు. క‌రోనా వ్యాప్తి చెంద‌కుండా త‌గిన జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంతో పాటు సుర‌క్షితంగా ఉండాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చాడు. రోహిత్ ట్విట్ట‌ర్ ద్వారా ఓ వీడియోను పంచుకున్నాడు. క్రీడాలోకం స్తంభించిపోవ‌డం విచారంగా ఉంది. ఇలాంటి స‌మ‌యాల్లో ధైర్యంగా ఉండాల్సిన అవ‌స‌రముంది. వైర‌స్ ద‌రిచేర‌క ముందే జాగ్ర‌త్త‌లు పాటించాలి. ప‌రిస‌రాల‌పై ఓ క‌న్నేసి ఉంది…కాస్త ఆనారోగ్యంగా అనిపిస్తే వెంట‌నే వైద్యుల‌ను సంప్ర‌దించాలి. త‌మ ప్రాణాల‌ను లెక్క‌చేయ‌కుండా..క‌రోనా బాధితుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హిస్తున్న వైద్య సిబ్బంది కృషికి నా అభినంద‌న‌లు. ట్విట్ట‌ర్ లో చివ‌రిగా ఒక్క‌మాట‌… జాగ్ర‌త్త‌గా ఉండండి. సుర‌క్షితంగా ఉండండి. అని పేర్కొన్నాడు.